కోర్టులో రెపరెపలాడిన మువ్వన్నెల జెండా

15 Aug, 2017 23:25 IST|Sakshi

అనంతపురం లీగల్‌: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కోర్టు ఆవరణలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్‌.శశిధర్‌ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. అంతేకాకుండా కార్మిక న్యాయస్థానం న్యాయమూర్తి జి. స్వర్ణలత, వినియోగదారుల న్యాయస్థానం ఎదుట ఫోరం అధ్యక్షురాలు వై.ప్రమీలారెడ్డి, న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో అశోకస్థూపం వద్ద న్యాయవాదసంఘం అధ్యక్షుడు టి.భరత్‌భూషన్‌రెడ్డి తదితరులు త్రివర్ణపతాకాలు ఎగుర వేశారు.

మరిన్ని వార్తలు