ప్రజలకు గవర్నర్ స్వాతంత్య్రదినోత్సవ శుభాకాంక్షలు

14 Aug, 2016 20:39 IST|Sakshi

70వ స్వతంత్ర దినోత్సవాలు పురస్కరించుకొని ఏపీ, తెలంగాణా ప్రజలకు ఉమ్మడి గవర్నర్ ఈఎస్‌ఎల్.నర్సింహన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో దేశస్యాతంత్రం కొరకు తమ ప్రాణాలు అర్పించిన దేశభక్తులు అందించిన స్పూర్తితో ముందుకుసాగాలన్నారు. నిస్వార్దంగా వారు దేశం కొసం వారు అందించిన సేవలను కొనియాడారు. వారి త్యాగాలను ఎన్నటికి మరువలేమని, సమాజంలోని అన్ని వర్గాలకు స్యతంత్ర ఫలాలు సమానంగా అందేలా ప్రతిఒక్కరు పునరంకితం కావాలని ఆయన పిలుపిచ్చారు.

 

మరిన్ని వార్తలు