చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

23 Jul, 2016 21:49 IST|Sakshi

చేగుంట: ఆవు పొడవడంతో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోతపల్లి జిల్లగుట్టతండాకు చెందిన లచ్యా నాయక్‌ (65) ఆవు పాలు పితుకుతున్న సమయంలో ఆవు పొడిచింది. పొత్తికడుపులో తీవ్ర గాయమైన లచ్యానాయక్‌ను హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రికి చికిత్స కోసం పంపించారు. చికిత్స పొందుతూ  లచ్యానాయక్‌ శనివారం మృతి చెందాడు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి శవానికి పోస్టుమార్టం నిర్వహింపజేసి బంధువులకు అప్పగించినట్లు ఎస్‌ఐ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.

>
మరిన్ని వార్తలు