విద్యార్థులకు ఇన్‌స్సైర్‌ ఆవార్డులు

21 Jul, 2016 01:39 IST|Sakshi
ఏలూరు సిటీ : విద్యార్థుల్లో శాస్త్ర, సాంకేతిక రంగంలో అవగాహన కల్పించడంతో పాటు భవిష్యత్తు శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం స్ఫూర్తి అవార్డులను అందిస్తోంది. కేంద్ర సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ శాఖ  ఏటా దేశవ్యాప్తంగా ప్రతిభ చూపిన విద్యార్థులను ఈ అవార్డులకు ఎంపిక చేస్తోంది. తద్వారా సమాజానికి ఉపయోగపడే వినూత్న ప్రయోగాలను తయారు చేసేందుకు ప్రోత్సహిస్తోంది. ఈ ఇన్‌స్ఫైర్‌ అవార్డులకు జిల్లాలో 365 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. ఒక్కొక్క విద్యార్థికి రూ.5 వేల నగదు బహుమతిని కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. 
 
మరిన్ని వార్తలు