15, 16 తేదీల్లో ఇన్‌స్పైర్‌ ఎగ్జిబిషన్‌

13 Oct, 2016 00:56 IST|Sakshi
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): కర్నూలు, ఆదోని డివిజన్లకు సంబంధించి ఇన్‌స్పైర్‌ ఎగ్జిబిషన్‌ను దిన్నెదేవరపాడు సమీపంలోని కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్‌ పాఠశాలలో నిర్వహించనున్నట్లు డీఈఓ రవీంద్రనాథ్‌రెడ్డి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆయా డివిజన్లకు సంబంధించిన ప్రధానోపాధ్యాయులు, సైన్స్‌ ఉపాధ్యాయులు ఎంపిక చేసిన విద్యార్థులను తప్పకుండా ప్రదర్శనకు తీసుకురావాలని ఆదేశించారు. 15వ తేదీ ఉదయం 8 గంటలకు సంబంధిత విద్యార్థి, గైడ్‌తో పాటు ప్రదర్శన వివరాలను రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలని సూచించారు.
 
మరిన్ని వార్తలు