ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య..

22 Sep, 2017 14:28 IST|Sakshi

జయశంకర్‌ భూపాలపల్లి: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ ఇంటర్‌ విద్యార్థిని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన జిల్లాలోని ఏటూరు నాగారం మండలం రాంనగర్‌ గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గారె నారాయణ, వెంకటమ్మల కుమార్తె గారె సులోమిని(17) ములుగులోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో ఇంటర్‌ ఫస్ట్‌ ఈయర్‌ చదువుతోంది.

తల్లిదండ్రుల మధ్య తరచు గొడవలు జరుగుతుండటంలో మరస్తాపానికి గురై బలవర్మరణానికి పాల్పడింది.  విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
                       
                      
      

మరిన్ని వార్తలు