24 నుంచి అంతర్జాతీయ మారథాన్‌

20 Jan, 2017 00:03 IST|Sakshi
అనంతపురం న్యూసిటీ : రూరల్‌ డెవలప్‌మెంట్‌ ట్రస్టు (ఆర్డీటీ) మరో గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పేద పిల్లల అభ్యున్నతి కోసం అనంతపురంలో ఈ నెల 24 నుంచి రెండురోజుల పాటు అంతర్జాతీయ రిలే అల్ట్రా మారథాన్‌ నిర్వహిస్తోంది. స్పెయిన్‌ దేశానికి చెందిన జువాన్‌ మాన్యువల్‌ ఆధ్వర్యంలో ఈ మారథాన్‌ జరుగనుంది. గతేడాది ఆయనొక్కడే 140 కిలో మీటర్లు పరుగెత్తాడు. ఈ సారి 48 మంది సభ్యులతో మారథాన్‌ చేపడుతారు. రూ.18 లక్షలు సమకూర్చేందుకు 35 మంది స్పెయిన్‌ దేశస్తులు, 15 మంది ‘అనంత’వాసులు మారథాన్‌లో పరుగెత్తనున్నారు. 
మరిన్ని వార్తలు