నెల్లూరు యువతికి పెటా అవార్డు

2 Nov, 2015 19:04 IST|Sakshi

నెల్లూరు: నెల్లూరుకు చెందిన ఇషితా జైన్ (24) పెటా (పీపుల్ ఫర్ ద ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ ఎనిమల్స్) భారత్ 'క్యూటెస్ట్ వెజిటేరియన్ నెక్స్ట్ డోర్' పోటీలో గెలుపొందారు. తుది ఫోటీలో ఇషితా జైన్ మరో తొమ్మిది మంది మహిళలను ఓడించి 2330 ఓట్లతో విజేతగా నిలిచారు. ఇషితా జైన్కు సర్టిఫికెట్, ట్రోఫీ ప్రధానం చేయనున్నట్టు పెటా ఓ ప్రకటనలో తెలిపింది.

జీవితమంతా తాను శాకాహారిగా ఉంటానని, రుచి కోసం ఓ ప్రాణిని చంపడాన్ని ఇష్టపడనని ఇషితా జైనా పేర్కొన్నారు. ఇషితా చాలా ఆరోగ్యంగా, దయాగుణంతో,  ఆకర్షణీయంగా ఉన్నారని భారత్లో పెటా ప్రతినిధి భువనేశ్వరి గుప్తా ప్రశంసించారు. పురుషుల విభాగంలో అహ్మద్నగర్ నివాసి అభిజిన్ వాఘ్మరే విజేతగా నిలిచారు.

మరిన్ని వార్తలు