28న ఐటీ ప్రిన్సిపల్‌ కమిషనర్‌ కర్నూలు రాక

26 Feb, 2017 00:12 IST|Sakshi
కర్నూలు(రాజ్‌విహార్‌) : ఆదాయ పన్ను శాఖ(ఐటీ) ప్రిన్సిపల్‌ కమిషనర్‌ ఎం.జగదీష్‌ బాబు ఈనెల 28వ తేదీన కర్నూలుకు రానున్నట్లు ఇన్‌కం ట్యాక్స్‌ ఆఫీసర్‌ పి.సత్యప్రకాష్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వాణిజ్య, వ్యాపారవేత్తలు, చాంబర్‌ ఆఫ్‌ కామర్స్, ట్యాక్స్‌ బార్, పరిశ్రమల పారిశ్రామికవేత్తలతో  అశోక్‌నగర్‌లో నిర్వహించే సమావేశంలో ఆయన అతిథిగా పాల్గొంటారన్నారు. 
 
మరిన్ని వార్తలు