అనంతపురం అర్బన్: రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు బుధవారం జిల్లాకు విచ్చేస్తున్నారు. ఉదయం 5.20 గంటలకు అయన అనంతపురం చేరుకుంటారు. 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒక గంట వరకు జరుగనున్న బ్రాహ్మణ అవగాహన సదస్సులో పాల్గొంటారు.
మూడు గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇన్చార్జి కలెక్టర్, బ్యాంకర్లు, బ్రాహ్మణ, ఆర్యవైశ్య పెద్దలతో సమావేశం నిర్వహిస్తారు. ఐదు గంటలకు విలేకరులు సమావేశం నిర్వహిస్తారు. అనంతరం హైదరాబాద్కు బయలుదేరి వెళతారు.