'టీఆర్‌ఎస్ ప్రజలను మభ్యపెడుతోంది'

8 Sep, 2016 18:50 IST|Sakshi
'టీఆర్‌ఎస్ ప్రజలను మభ్యపెడుతోంది'

తెలంగాణాలో కరవు విలయతాండవం చేస్తుంటే టీఆర్‌ఎస్ ప్రభుత్వం మాత్రం సెంటిమెంట్‌తో ప్రజలను ఇంకా మభ్యపెడుతోందని సీఎల్పీ నేత జానారెడ్డి విమర్శించారు.

పార్టీని, ప్రభుత్వాన్ని పణంగా పెట్టి తెలంగాణ ఇస్తే.. టీఆర్‌ఎస్ సంక్షోభాల రాష్ట్రంగా మారుస్తున్నదని తూర్పార బట్టారు. ఇక్కడ జరుగుతున్న రైతురణభేరి కార్యక్రమంలో మాట్లాడారు. ఇది ప్రజా ప్రభుత్వం కాదని, అధికార మదంతో వ్యవహరిస్తున్న ప్రభుత్వమన్నారు. గ్రామ గ్రామాన రైతులను చైతన్యం చేస్తూ ప్రభుత్వంపై పోరాటం చేస్తామని తెలిపారు.

 

>
మరిన్ని వార్తలు