'అందుకే చంద్రబాబు అంటే మోదీకి భయం'

31 Jul, 2016 10:46 IST|Sakshi
'అందుకే చంద్రబాబు అంటే మోదీకి భయం'

విజయవాడ : బీజేపీతో టీడీపీ విడిపోవాల్సిందేనని అనంతపురం ఎంపీ జేసీ దివాకర్రెడ్డి స్పష్టం చేశారు. వచ్చే ఏడాది మార్చినాటికి విడిపోతే మంచిదని ఆయన స్పష్టం చేశారు. శనివారం విజయవాడలో జేసీ దివాకర్రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ... ప్రధాని మోదీకి చంద్రబాబు ప్రధాన శత్రువుగా కనబడుతున్నారన్నారు. ఏపీకి ప్రత్యేకే హోదా ఇవ్వాలనే ఉద్దేశ్యం బీజేపీకి లేదని వ్యాఖ్యానించారు. అందుకే రూల్స్ పేరు చెప్పి ఆ పార్టీ తప్పించుకుంటోందని ఆరోపించారు. ప్రధానికి ప్రత్యేక హోదా ఇవ్వాలనుకుంటే రూల్స్ ఏమీ అడ్డంకి కాదని దివాకర్రెడ్డి తెలిపారు.

రాబోయే ఎన్నికల్లో మోదీకి ప్రాంతీయ పార్టీల సహకారం అవసరమన్నారు. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పేది చంద్రబాబు, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమారు అని ఆయన చెప్పారు. అందుకే చంద్రబాబు అంటే మోదీకి భయం అని జేసీ దివాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఏడాది క్రితమే బీజేపీతో విడిపోవాలని చంద్రబాబుకు చెప్పానని జేసీ దివాకర్రెడ్డి గుర్తు చేశారు.

మరిన్ని వార్తలు