కేంద్రానికి జేసీ ప్రభాకర్ వార్నింగ్

27 Aug, 2015 20:28 IST|Sakshi
కేంద్రానికి జేసీ ప్రభాకర్ వార్నింగ్

అనంతపురం: తాడిపత్రి టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేశారు. రాష్ట్ర విభజన వల్ల రాయలసీమకు తీవ్ర అన్యాయం జరిగిందని, ఇప్పుడు ఇచ్చే ప్యాకేజీలో తమ ప్రాంత అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

రాయలసీమకు అధిక ప్రాధాన్యం ఇవ్వకుంటే పార్టీలకతీతంగా ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... రాయలసీమకు న్యాయం చేయాలన్నారు.

మరిన్ని వార్తలు