జేసీబీ దహనం: మావోయిస్టుల చర్యేనా?

22 Mar, 2016 13:51 IST|Sakshi

కరీంనగర్ జిల్లా కోనరావుపేట మండలంలో జరిగిన వరుస ఘటనలు మావోయిస్టుల సంచారంపై అనుమానాలు కలిగిస్తున్నాయి. సోమవారం రాత్రి మండలంలోని రామన్నపేట శివారులో ఒక కాంట్రాక్టర్‌కు చెందిన జేసీబీని గుర్తు తెలియని వ్యక్తులు కాలబెట్టారు. దాదాపు రూ.20 లక్షల మేర నష్టం వాటిల్లిందని బాధితులు తెలిపారు. ఈ జేసీబీని ఇక్కడ గుట్టను తవ్వేందుకు వాడుతున్నారు. ఇదే విధంగా ఇటీవల మరిమడ్ల గ్రామంలోని సెల్‌ఫోన్ టవర్‌ను కూడా కాలబెట్టారు. ఈ రెండు ఘటనల నేపథ్యంలో ఇది మావోయిస్టుల పనిగా అనుమానిస్తున్నారు.

 

మరిన్ని వార్తలు