బాలాజీచెరువు (కాకినాడ సిటీ) :
స్థానిక జిల్లా ఉపాధి కల్పనాధికారి కార్యాలయంలో ఈ నెల 17న జాబ్మేళా నిర్వహించనున్నట్టు ఉపాధి కల్పనాధికారి కుసుమ శాంతి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.రాజమండ్రి వినూత్న ఫెర్టిలైజర్స్లో సేల్స్ అసిస్టెంట్స్గా పనిచేయడానికి పదవ తరగతి నుంచి డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు హాజరుకావచ్చన్నారు. పూర్తి వివరాలకు 0884–2373270కు సంప్రదించాలని ఆమె కోరారు.