కేయూ క్యాంపస్ : హన్మకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఈనెల 26న మెగా జాబ్మేళా ని ర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ కె.రామానుజరావు శనివా రం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రముఖ కంపెనీల బా ధ్యులు హాజరై ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని పేర్కొన్నా రు. ఎస్సెస్సీ నుంచి డిగ్రీ వరకు చదివిన వారికి వి ద్యార్హతలను బట్టి అవకాశాలు కల్పిస్తారని తెలిపారు. ఆయా కంపెన్నీల్లో ట్రెయినీలుగా పనిచేసేందుకు ఎంపిక చేసిన వారికి పదమూడు వారాల నుంచి పది నెలల వర కు పాటు శిక్షణ ఉంటుందని వివరించారు. ఈ మేరకు విద్యార్థులు జాబ్మేళాను సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపాల్ ఈ సందర్భంగా కోరారు.