రేపు నిరుద్యోగులకు జాబ్‌మేళా

25 Mar, 2017 23:47 IST|Sakshi
కర్నూలు(హాస్పిటల్‌): నిరుద్యోగుల కోసం ఈ నెల 27వ తేదీన మధ్యాహ్నం​ 2 గంటలకు జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు ఫస్ట్‌స్టెప్‌ శిక్షణ, ఉపాధి కేంద్రం చైర్మన్‌ ఎస్‌. రాజశేఖర్‌ శనివారం ప్రకటనలో తెలిపారు. ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ, సత్యసుమ మార్కెటర్స్‌ కంపెనీల్లో మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్స్,  టీం లీడర్ల  కోసం నిర్వహించే  ఈ మేళాలో ఎంపికైన వారికి నెలకు రూ.7వేల జీతం, ఇన్సెంటీవ్‌ ఇస్తామన్నారు. ఆసక్తిగల నిరుద్యోగ యువకులకు స్థానిక భాగ్యనగర్‌లోని ఫస్ట్‌స్టెప్‌ సంస్థ కార్యాలయానికి  చేరుకోవాలని,
వివరాలకు 9393930109, 8099932144 నంబర్లకు ఫోన్‌ చేయాలని సూచించారు. 
 
మరిన్ని వార్తలు