చిట్టిబాబాజీ సంస్థానంలో జస్టిస్‌ చలమేశ్వర్‌

3 Apr, 2017 23:39 IST|Sakshi
సీతానగరం (రాజానగరం) :
సుప్రీం కోర్టు జడ్జి జాస్తి చలమేశ్వర్‌ సతీసమేతంగా సోమవారం రాత్రి రఘుదేవపురం పంచాయతీ శ్రీరామనగరంలోని శ్రీచిట్టిబాబాజీ సంస్థానానికి  వచ్చా రు. వారికి రాజమండ్రి 6వ జ్యుడిషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌ వెంకటేశ్వరరావు, కోరు కొండ సీఐ మధుసూదనరావు, సీతానగరం ఎస్సై వెంకటేశ్వరరావు స్వాగతం పలికారు. జస్టిస్‌ చలమేశ్వర్‌  మంగళవారం సాయంత్రం వరకు సంస్థానంలో ఉంటారని నిర్వాహకులు జగ్గబాబు తెలిపారు.
 
మరిన్ని వార్తలు