కదంబం కళ కళ

1 Aug, 2016 00:53 IST|Sakshi
కదంబం కళ కళ
కురవి శివాలయంలోని కదంబం చెట్టు పూలతో కళకళలాడుతోంది. ఆలయం లో ధ్వజస్తంభం ప్రతిష్ఠకు ముందు ప్రధాన పూజారి పారుపల్లి రామన్న, సిబ్బంది కదంబం మొక్కను తీసుకొచ్చి నాటారు. ఈ మేరకు మెుక్క పెరిగి చెట్టుగా మారి పచ్చని పుష్పాలతో భక్తులను ఆకట్టుకుంటోంది. భద్రకాళి అమ్మవారికి ఇష్టమైన పూలను ప్రతి రోజు ఉదయం, సాయంత్రం వేళల్లో పూజారులు తీసుకొచ్చి భద్రకాళీ సమేత శ్రీవీరభద్రస్వామి ఆలయంలోని ఉత్సవ మూర్తుల వద్ద పెట్టి పూజలు నిర్వహిస్తున్నారు.
–కురవి 
మరిన్ని వార్తలు