సెప్టెంబర్‌ 7 నుంచి ‘కళా ఉత్సవ్‌’

10 Aug, 2016 00:32 IST|Sakshi
విద్యారణ్యపురి : ఆర్‌ఎంఎస్‌ఏ ఆధ్వర్యంలో జిల్లాస్థాయిలో ‘కళా ఉత్సవ్‌’ కార్యక్రమాన్ని సెప్టెంబర్‌ 7,8,9 తేదీల్లో నిర్వహించనున్నారు. ఈమేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. దీని నిర్వహణకు డీఈఓ కన్వీనర్‌గా, డైట్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ నోడల్‌ ఆఫీసర్‌గా వ్యవహరిస్తారు. మ్యూజిక్, డ్యాన్స్, థియేటర్‌ ఆర్ట్స్, డ్రాయింగ్, పెయింటింగ్, స్కల్ప్‌చర్, క్రాఫ్ట్‌ విభాగాల్లో విద్యార్థులు జట్లుగా పోటీల్లో పాల్గొనాలన్నారు. ప్రభుత్వ, ఎయిడెడ్, పాఠశాలలు, కళాశాలలకు చెందిన 9,10, ఇంటర్మీడియట్‌ విద్యార్థినీ,విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనొచ్చన్నారు. వీటిలో రాణించిన వారిని వచ్చే నెల 27,28 తేదీల్లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు పంపిస్తారన్నారు. అక్కడ కూడా ఎంపికైతే  నవంబర్‌ 15 నుంచి 19 వరకు జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు అర్హత సాధిస్తారన్నారు. జాతీయ స్థాయి విజేతలకు మొదటి బహుమతిగా రూ.1.25 లక్షలు, ద్వితీయ బహుమతిగా రూ.75వేలు, తృతీయ బహుమతిగా రూ.50వేలు అందజేస్తారన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. 
మరిన్ని వార్తలు