శ్రీవారిని దర్శించుకున్న కళా వెంకట్రావ్

12 May, 2016 08:45 IST|Sakshi

తిరుమల: తిరుమల శ్రీవారిని ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడు కె.కళా వెంకట్రావ్ గురువారం దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో ఆయన స్వామివారిని దర్శించుకున్నారు. ఆయనతో పాటు ప్రముఖ హాస్య నటుడు ధన్రాజ్ కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. అలాగే చిత్తూరు జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన జయలక్ష్మీ కూడా శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం వారికి ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

మరిన్ని వార్తలు