విజయనగరం ఆసుపత్రిలో కామినేని తనిఖీలు

19 Aug, 2015 12:01 IST|Sakshi

విజయనగరం: విజయనగరం జిల్లా వైద్య విధాన పరిషత్ ఆసుపత్రిలో ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ బుధవారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఉదయం 11.00 గంటలైనా సెంట్రల్ డ్రగ్ స్టోర్స్లో సిబ్బంది విధులకు హాజరుకాకపోవడంపై మంత్రి కామినేని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సదరు సిబ్బందిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు కామినేని ఆదేశించారు. అనంతరం ఆసుపత్రిలోని వివిధ విభాగాలను కామినేని పరిశీలించారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలపై రోగులను కామినేని అడిగి తెలుసుకున్నారు.

మరిన్ని వార్తలు