‘బీసీ జాబితాలోకి చేర్చేదాకా పోరాటం’

14 Nov, 2016 01:17 IST|Sakshi
కదిరి టౌన్: అన్ని విధాలా వెనుకబడి ఉన్న బలిజలను బీసీ జాబితాలోకి చేర్చి అభివృద్ధి పరచాలని కాపునాడు రాష్ట్ర అధ్యక్షుడు నారాయణస్వామి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆదివారం పట్టణంలోని దత్తా ఫంక్ష¯Œన్ హాల్‌లో బలిజ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాౖటెన బలిజ చైతన్య యాత్ర అవగాహన సదస్సుకు ఆయన  ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. బలిజ తాలూకా అ«ధ్యక్షుడు గరడాల రమణ అధ్యక్షత వహించగా,  కార్పొరేట్‌ కంపెనీ ఎండీ రమేష్‌బాబు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నారాయణస్వామి మాట్లాడుతూ  గ్రామస్థాయి నుంచి అందరూ ఏకతాటిపై వచ్చి బలిజల హక్కులు సాధించేవరకు నిరంతరం పోరాటాలు సాగించాలని పిలుపునిచ్చారు.  బీసీల్లోకి చేర్చేవరకు ఎవరూ విశ్రమించరాదని, హక్కుల్ని పొందేవరకు ప్రభుత్వంపై పోరాడాలన్నారు. సమావేశంలో ఆ సంఘం నాయకులు సురేష్, శ్రీనివాసులు ప్రసాద్, రమేష్, సూరి, శీన, సుబ్బయ్య, రమణ, వెంకటనారాయణ, సురేష్‌బాబు, రాముడు, శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.  
మరిన్ని వార్తలు