తిరుచానూరు: తిరుచానూరులో మంగళవారం ఉదయం నుంచి పద్మావతి అమ్మవారి వార్షీక కార్తీక బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి. ఉదయం 8:32 నిమిషాలకు ధనుర్లగ్నంలో అమ్మవారికి అత్యంత ఇష్టమైన ధ్వజారోహణంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి.
9 రోజుల పాటు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు కన్నులపండుగగా జరగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా అమ్మవారికి పట్టువస్త్రాలను ప్రభుత్వం సమర్పించనున్నది.