కస్తూర్బా విద్యార్థినికి తీవ్రగాయాలు

22 Jun, 2016 10:32 IST|Sakshi

మెదక్: నారాయణ్‌ఖేడ్ కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాల విద్యార్థిని గాయపడింది. మండలంలోని రాంచందర్ తండాకు చెందిన స్రవంతి పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. బుధవారం ఉదయం ఆమె పాఠశాల భవనంపై నుంచి ప్రమాదవశాత్తు అదుపుతప్పి కిందపడింది. తీవ్రంగా గాయపడిన ఆమెను వెంటనే నారాయణ్‌ఖేడ్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

మరిన్ని వార్తలు