కోనప్పను అభినందించిన ముఖ్యమంత్రి

31 Dec, 2016 17:39 IST|Sakshi
కోనప్పను అభినందించిన ముఖ్యమంత్రి

కాగజ్‌నగర్‌: సిర్పూర్‌ నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఎమ్మెల్యే కోనేరు కోనప్పను గురువారం రాత్రి హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అభినందించారు. మంత్రి జగదీశ్వర్‌ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే ముఖ్యమంత్రిని కలిశారు.

సిర్పూర్‌ తాలూకాలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో సొంత నిధులతో ఇంటర్మీడియెట్‌ విద్యార్థులకు ఉచితంగా మధ్యాహ్న భోజనం అందించడం గొప్ప విషయమని సీఎం కొనియాడారు. అనంతరం ఎమ్మెల్యే కోనేరు కోనప్ప విజ్ఞప్తి మేరకు పెంచికల్‌పేట బ్రిడ్జి నిర్మాణానికి రూ.30 కోట్లు, రోడ్ల నిర్మాణానికి 4.10 కోట్లు సీఎం మంజూరు చేసినట్లు ప్రకటించారు.

మరిన్ని వార్తలు