కామెడీగా మారిన కేసీఆర్ పాలన: శ్రవణ్

12 Jan, 2016 02:25 IST|Sakshi
కామెడీగా మారిన కేసీఆర్ పాలన: శ్రవణ్

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో టీఆర్‌ఎస్ పాలన అంతా కామెడీగా మారిందిన టీపీసీసీ ముఖ్య అధికారప్రతినిధి దాసోజు శ్రవణ్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర సమితిని తెలుగు రాష్ట్ర సమితిగా మారుస్తానని, భీమవరం నుంచి పోటీ చేస్తానని చెప్పిన మంత్రి కేటీఆర్.. మాటమార్చి జోక్ చేసినట్లు చెప్పారని గుర్తుచేశారు. రాష్ట్రంలో రాజకీయాలను, పరిపాలనను కూడా సీఎం కేసీఆర్, కేటీఆర్ జోక్‌గా, పరాచికంగా చేశారని ఆరోపించారు. సీఎం కేసీఆర్ కుమార్తె కవితకు మాత్రమే బుల్లెట్‌ప్రూఫ్ వాహనాన్ని అందించాల్సిన అవసరం ఏమొచ్చిందని శ్రవణ్ ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు