ప్రభుత్వ భూములు కబ్జా చేస్తే కఠిన చర్యలు

21 Aug, 2015 10:01 IST|Sakshi

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా కీసర మండలం రాంపల్లి సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి అవినీతి అక్రమాలపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఆ అంశంపై విచారణకు ఆదేశించినట్లు స్థానిక ఎమ్మార్వో సీహెచ్ రవీంద్రరెడ్డి శుక్రవారం వెల్లడించారు. కీసర మండలంలోని ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

అలాంటి చర్యలకు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని రవీంద్రరెడ్డి హెచ్చరించారు. అయితే రంగారెడ్డి జిల్లా జవహర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భూకబ్జాలకు పాల్పడుతున్న టీఆర్ఎస్ నేత శ్రీనివాస్పై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు