కేసీకి 40 క్యూసెక్కుల నీటి విడుదల

24 Feb, 2017 00:13 IST|Sakshi
 
 
సుంకేసుల(గూడూరు రూరల్‌): సుంకేసుల రిజర్వాయర్‌ నుంచి కేసీ కెనాల్‌కు 40 క్యూసెక్కుల నీటిని గురువారం విడుదల చేసినట్లు డ్యాం జేఈ శ్రీనివాసరెడ్డి తెలిపారు. కర్నూలు నగర ప్రజల తాగునీటి అవసరాల నిమిత్తం రిజర్వాయర్‌ నుంచి కేసీ కెనాల్‌కు 40 క్యూసెక్కుల నీటిని విడుదల చేశామని, ప్రస్తుతం రిజార్వయర్‌లో 0.225 టీఎంసీల నీరు నిల్వ ఉందని ఆయన తెలిపారు.
మరిన్ని వార్తలు