క్షీరారామం హుండీ ఆదాయం రూ.7.93 లక్షలు

30 Mar, 2017 18:02 IST|Sakshi
క్షీరారామం హుండీ ఆదాయం రూ.7.93 లక్షలు
పాలకొల్లు సెంట్రల్‌: పంచారామక్షేత్రం పాలకొల్లు క్షీరారామలింగేశ్వరస్వామి  (క్షీరారామం) ఆలయ హుండీ ఆదాయాన్ని గురువారం లెక్కించారు. మూడు నెలలకు రూ.7,93,807 నగదు, మూడు విదేశీ నోట్లు లభించాయని అధికారులు తెలిపారు. ఆచంట రామేశ్వరస్వామి దేవస్థానం ఈవో కృష్ణంరాజు ఆధ్వర్యంలో లెక్కింపు జరిగింది. ఈవో యర్రంశెట్టి భద్రాజీ, కె.శ్రీనివాసరావు, ట్రస్ట్‌ బోర్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. 
మరిన్ని వార్తలు