కొండ చిలువల కలకలం

13 Sep, 2016 10:51 IST|Sakshi
కొండ చిలువల కలకలం
ఆకివీడు(పశ్చిమగోదావరి జిల్లా): ఆకివీడులో రెండు కొండ చిలువలు సోమవారం కలకలం సృష్టించాయి. గ్రామంలోని 1వ వార్డులోని ఐబీపీ పెట్రోల్‌ బంక్‌ వెనుక ప్రాంతంలోని చేల వద్ద రెండు కొండ చిలువలు కనిపించడంతో స్థానికులు భయాందోళన చెందారు. ఈ ప్రాంతానికి చెందిన యువకులు వీటిని కొట్టి చంపారు.

ఒక్కో కొండ చిలువ 10 అడుగుల పొడవు ఉంది. కొద్దిరోజులుగా మెట్ట ప్రాంతం నుంచి ఎర్ర కంకరను లారీల్లో తీసుకువచ్చి స్థానిక ఆదర్శ స్కూల్‌ వద్ద నిల్వ ఉంచారు. ఎర్రకంకరతో పాటు కొండ చిలువలు లారీల్లో వచ్చి ఉంటాయని స్థానికులు భావిస్తున్నారు.
మరిన్ని వార్తలు