నిండుకుండలా..కిన్నెరసాని..

23 Sep, 2016 23:43 IST|Sakshi
నిండుకుండలా..కిన్నెరసాని..
పాల్వంచ రూరల్‌: కిన్నెరసాని రిజర్వాయర్‌ 407 అడుగల నీటి నిల్వ సామర్థ్యానికి గాను 406.60 అడుగులకు వరద చేరగా.శుక్రవారం ఉదయం నుంచి రెండు గేట్లను ఎత్తి, దిగువకు 6వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. రాజాపురం, యానంబైల్‌ గ్రామాల మధ్య లోలేవల్‌ చప్టాపైనుంచి వరదనీరు పొంగింది. యానంబైల్, ఉల్వనూరు, చండ్రాలగూడెం గ్రామ పంచాయతీల పరిధిలో 20కిపైగా గిరిజన గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి.
>
మరిన్ని వార్తలు