కోహెడ మండలాన్ని కరీంనగర్‌ జిల్లాలో ఉంచాలి

21 Aug, 2016 22:52 IST|Sakshi
 
కోహెడ: కరీంనగర్‌ జిల్లాలో కోహెడ మండలాన్ని కొనసాగించాలని కోరుతూ ఆదివారం వెంకటేశ్వరపల్లిలో అఖిల పక్షం ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్బంగా అఖిల పక్షం నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం జిల్లాల పునర్విభజనతో ప్రజల మనోభావాలను దెబ్బతీస్తుందన్నారు. గాంధీ విగ్రహం వద్ద చెవిలో ప“లతో ప్రభుత్వానికి నిరసన తెలిపారు. ప్రజల ఆకాంక్షతో ప్రభుత్వం అంతిమ నిర్ణయం తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో అఖిల పక్షం నాయకులు ఖమ్మం వెంకటేశం, గవ్వ వంశీధర్‌రెడ్డి, వసాల సంపత్, బందెల బాలకిషన్, కమలాకర్‌రావు, వలుస సుభాష్, పిడిÔð ట్టి రాజు, గాజుల వెంకటేశ్వర్లు, చేపూరి తిరుపతి, పండుగ మల్లయ్య పాల్గొన్నారు.
 
 
మరిన్ని వార్తలు