కేసీఆర్ ఎర్రవల్లికే ముఖ్యమంత్రి : కోమటిరెడ్డి

10 Jul, 2016 17:53 IST|Sakshi
కేసీఆర్ ఎర్రవల్లికే ముఖ్యమంత్రి : కోమటిరెడ్డి

నల్లగొండ: తెలంగాణ సీఎం కేసీఆర్ ఎర్రవల్లికే ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ శాసనసభా పక్ష ఉపనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. మిర్యాలగూడలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ...ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పుణ్యమా అని పైసా ఖర్చులేకుండా గెలిచి..పార్టీ ఫిరాయించారని మండిపడ్డారు.

కేసీఆర్ సీఎం కాగానే నాగార్జునసాగర్ ఎండిపోయిందని టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలను ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, రిజర్వేషన్ల పేరుతో ప్రజలను కేసీఆర్ ప్రభుత్వం మోసం చేస్తోందని ఉత్తమ్ ఆరోపించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు జానారెడ్డి, షబ్బీర్ అలీ, పాల్వాయి గోవర్థన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు