భక్తజన సంద్రం.. కొమురెల్లి తీర్థం

25 Jul, 2016 00:19 IST|Sakshi
భక్తజన సంద్రం.. కొమురెల్లి తీర్థం
ఆషాఢమాసాన్ని పురస్కరించుకుని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి శ్రీమల్లికార్జునస్వామి క్షేత్రం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. ఈ మేరకు హైదరాబాద్, సికింద్రాబాద్, మెదక్, వరంగల్, కరీంనగర్‌ జిల్లాల నుంచి భక్తులు భారీగా తరలిరావడంతో మల్లన్న ఆలయం రద్దీగా మారింది. తొలు త భక్తులు మల్లన్నకు బోనాలు సమర్పించారు. అనంతరం గంగిరేగు చెట్టు వద్ద పట్నాలు వేసి మెుక్కులు చెల్లించారు. అలాగే మల్లన్నకు కల్యాణం జరి పించి కోరిన కోర్కెలు తీర్చాలని భక్తి శ్రద్ధలతో వేడుకున్నారు.
– చేర్యాల 
మరిన్ని వార్తలు