కొత్తపల్లి: ఆత్మకూరు ఏడీఏ షాలిరెడ్డి ఆదేశాల మేరకు కొత్తపల్లిలోని మనగ్రోమోర్ సెంటర్ను మండల వ్యవసాయ అధికారి నాగేంద్రప్రసాద్ సోమవారం సీజ్ చేశారు. నాలుగు రోజుల క్రితం ‘సాక్షి’లో ఎరువు...తరుగు' శీర్షికన ప్రచురితమైన కథనానికి తూనికలు కొలతలశాఖ అధికారులు మనగ్రోమోర్ సెంటర్ను పరిశీలించి నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. అలాగే ఏడీఏ ఆదేశాల మేరకు సోమవారం ఏఓ నాగేంద్రప్రసాద్ మనగ్రోమోర్ సెంటర్ను సీజ్చేసి 15 రోజుల వరకు క్రయ, విక్రయాలు జరగకుండా నిలిపివేశారు. ఈ సందర్భంగా ఏఓ మాట్లాడుతూ మండలంలోని ఎరువుల దుకాణం దారులు అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.