ఇళ్ల తొలగింపు.. తీవ్ర ఉద్రిక్తత

31 Oct, 2015 08:25 IST|Sakshi

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం రైల్వేస్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. అక్రమ నిర్మాణాలంటూ ప్రభుత్వ అధికారులు స్థానికంగా ఉన్న ఇళ్లను శనివారం ఉదయం తొలగిస్తున్నారు. ఇళ్ల నిర్మాణాల తొలగింపు చేపడుతున్న అధికారులను వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రక్తత నెలకొంది. నిర్వాసితులకు ప్రత్యామ్నయం చూపాలని సుబ్బారాయుడు అధికార పార్టీని డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తలు