'చంద్రబాబుకు ప్రజలే గుణపాఠం చెబుతారు'

30 Jul, 2016 11:11 IST|Sakshi

విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైఎస్ఆర్ సీపీ నేత కొయ్య ప్రసాదరెడ్డి శనివారం విశాఖపట్నంలో నిప్పులు చెరిగారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదన్నారు. స్వప్రయోజనాల కోసం బీజేపీతో టీడీపీ సావాసం చేస్తోందని మండిపడ్డారు.

చంద్రబాబుకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు. ఆగస్టు 2వ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించనున్న బంద్కు సహకరించాలని అన్ని పార్టీలకు కొయ్య ప్రసాదరెడ్డి విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు