బోయపాటి ఆధ్వర్యంలో ఏర్పాట్లు

23 Aug, 2016 17:31 IST|Sakshi
బోయపాటి ఆధ్వర్యంలో ఏర్పాట్లు

విజయవాడ : కృష్ణా పుష్కరాలు మంగళవారం ముగింపు రోజుకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో సంగమం ఘాట్లో పుష్కర హారతి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున్న సన్నాహాలు చేస్తుంది. అందులోభాగంగా తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీ నుంచి భారీ ఎత్తున రంగురంగుల  పూలు తెప్పించింది. అలాగే ఆస్ట్రేలియా నుంచి భారీగా టపాసులను తెప్పించింది.

ఈ పుష్కర వేడుకల్లో స్పెషల్ ఎఫెక్ట్, లేజర్ షో... ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి. టాలీవుడు ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్షన్లో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ పుష్కర హారతి తిలకించేందుకు భక్తులు ఇప్పటికే భారీగా సంగమం ఘాట్ వద్దకు తరలివస్తున్నారు. ఈ ముగింపు వేడుక కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రులు వెంకయ్య, సురేష్ ప్రభుతోపాటు సింధు, గోపిచంద్ కూడా పాల్గొంటారు. ఇబ్రహీంపట్నం వైపు వచ్చే వాహనాలను ఇతర ప్రాంతాల వైపునకు పోలీసులు తరలిస్తున్నారు.

మరిన్ని వార్తలు