భట్టిప్రోలు: ఆత్మ రక్షణకు షావోలిన్ కుంగ్ఫూ దోహదపడుతుందని ఎస్ఐ ఈ బాలనాగిరెడ్డి చెప్పారు. ఆదివారం భట్టిప్రోలులోని పద్మశాలీయ కల్యాణ మండపం ఆవరణలో షావోలిన్ కుంగ్ఫూ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో 3వ స్టేట్ ఓపెన్ కుంగ్ఫూ అండ్ కరాటే ఛాంపియన్ షిప్–2017 పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ దేహ దారుఢ్యానికి ఆటలు ముఖ్యమని తెలిపారు. ఎపీ చీఫ్ ఇన్స్ట్రక్టర్, టోర్నమెంట్ చీఫ్ జడ్జి వై ప్రభాకర్ మాట్లాడుతూ విద్యార్థులు నేర్చుకున్న ప్రతిభాపాటవాలను నలుగురికీ పంచాలని సూచించారు. ఆయా ప్రాంతాల నుంచి 200 మంది ఈ పోటీలలో పాల్గొన్నారు. కార్యక్రమంలో చీఫ్ ఇన్స్ట్రక్టర్ కె.గోపి, ఏపీ అడ్వైజర్ పి.అప్పారావు తదితరులు పాల్గొన్నారు. స్పైరింగ్, వెపన్ డిమానిస్ట్రేషన్, టీమ్, సింగిల్ విభాగాలలో పోటీలు నిర్వహించారు.