'ప్రాణం ఉన్నంతవరకూ జగన్తోనే'

8 Jan, 2016 18:53 IST|Sakshi

కర్నూలు : నీతిమాలిన రాజకీయాలకు తెర తీస్తున్నారంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై కర్నూలు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు శుక్రవారం  నిప్పులు చెరిగారు. జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉందని.. ఈ నేపథ్యంలో పార్టీని దెబ్బకొట్టేందుకు చంద్రబాబు కుట్ర పన్నారని వారు ఆరోపించారు.

చంద్రబాబు ఎన్ని ప్రయత్నాలు చేసినా తమ పార్టీ నుంచి ఎవరూ మరో పార్టీలోకి వెళ్లరని వారు తెలిపారు. ప్రాణం ఉన్నంత వరకూ తాము వైఎస్ జగన్తోనే ఉంటామని ఈ సందర్భంగా వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. ప్రజాసమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడతామని వారు తెలిపారు.

మరిన్ని వార్తలు