జాతీయ తైక్వాండో రెఫరీలుగా జిల్లా క్రీడాకారులు

17 Oct, 2016 23:25 IST|Sakshi
జాతీయ తైక్వాండో రెఫరీలుగా జిల్లా క్రీడాకారులు
 కల్లూరు: జాతీయ తైక్వాండో రెఫరీలుగా జిల్లా క్రీడాకారులు దాదాబాషా (ఆదోని), ఎంబి రాముబాబు (నందికొట్కూరు), డిఎం బిలాల్‌ నూర్‌బాషా (నంద్యాల), ఓబులేసు (ఆళ్లగడ్డ) ఎంపికయ్యారు. విశాఖపట్నం ఏయూ జిమ్నాజియం ఇండోర్‌ స్టేడియంలో ఈ నెల 13 నుంచి 16వ తేదీ వరకు జాతీయ స్థాయి తైక్వాండో సెమినార్‌ జరిగింది. ఈ సెమీనార్‌లో జిల్లా క్రీడాకారులు పాల్గొని ఉత్తమ ప్రతిభతో జాతీయ స్థాయి రెఫరీలుగా అర్హత సాధించారు. వీరిని తైక్వాండో సంఘం జిల్లా అధ్యక్షకార్యదర్శులు డీఎం గౌస్, శోభన్‌బాబు.. సోమవారం అభినందించారు.
 
మరిన్ని వార్తలు