నీటి వసతి లేదని రైలు నిలిపివేత

21 May, 2016 10:46 IST|Sakshi

ఖమ్మం: నీటి వసతి లేక ఇబ్బందులు పడిన ప్రయాణికులు చివరికి రైలును నిలిపివేశారు. ఖమ్మంలో శనివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. త్రివేండ్రం నుంచి గోరఖ్‌పూర్ వైపు వెళ్తున్న ముఫ్తీసాగర్ ఎక్స్‌ప్రెస్ రైలులో నీటి వసతి లేక ప్రయాణికులు అవస్థలు పడ్డారు. చివరికి ఖమ్మం రైల్వే స్టేషన్‌లో రైలును నిలిపివేశారు. రైల్వే అధికారులతో వాదులాటకు దిగారు. వసతి కల్పించేదాకా రైలును కదలనీయబోమంటూ భీష్మించారు. రెండు గంటలుగా రైలు ఆగిపోవటంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది.
 

మరిన్ని వార్తలు