ఉరేసుకుని మహిళ ఆత్మహత్య

18 Jul, 2016 00:11 IST|Sakshi
కాగజ్‌నగర్‌ రూరల్‌ : మండలంలోని న జ్రూల్‌నగర్‌ గ్రామ పంచాయతీ పరిధి విలేజ్‌ నం.5కు చెందిన రమాసహా(24) తన ఇంట్లో ఆదివారం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ కలహాలతోనే ఆమె ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుందని ఈజ్‌గాం ఎస్సై శివకుమార్‌ తెలిపారు. కానీ ఆమె ఆత్మహత్యకు పలువురి వేధింపులు కారణమని తెలుస్తోంది. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని వార్తలు