రైలు కింద పడి యువతి బలవన్మరణం

3 Dec, 2016 23:19 IST|Sakshi
రైలు కింద పడి యువతి బలవన్మరణం

హిందూపురం అర్బన్‌ : హిందూపురం మున్సిపల్‌ పరిధిలోని ముద్దిరెడ్డిపల్లికి చెందిన మగ్గం కార్మికురాలు నిర్మల(20) రైలు కింద పడి శనివారం ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే ఎస్‌ఐ ప్రభాకర్‌ తెలిపారు. కుటుంబ సమస్యల కారణంగా జీవితంపై విరక్తి చెంది ఆమె ఈ అఘాయిత్యానికి ఒడిగట్టిందన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం స్థానిక ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. 

>
మరిన్ని వార్తలు