లక్నవరం సందర్శించిన రేమండ్‌ పీటర్‌

12 Sep, 2016 00:04 IST|Sakshi
గోవిందరావుపేట : మండలంలోని లక్నవరం సరస్సును భూపరిపాలనా విభాగం రిటైర్డ్‌ చీఫ్‌ కమిషనర్‌ రేమండ్‌ పీటర్‌ కుటుంబ సమేతంగా సందర్శించారు. గత నెలాఖరులో రిటైర్‌ అయిన ఆయన కుటుంబ సభ్యులతో కలిసి లక్నవరం సరస్సు సందర్శనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు తహసీల్దార్‌ ముల్కనూరి శ్రీనివాస్‌ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్నవరం సరస్సు తాను ఊహించిన దానికంటే అందమైన ప్రాంతమన్నారు. వీఆర్‌ఓ రమేష్‌బాబుతో పాటు రెవెన్యూ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.  
>
మరిన్ని వార్తలు