ఇంటిస్థలం విషయంలో ఘర్షణ

17 Jun, 2016 16:10 IST|Sakshi

 ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం వల్లపల్లిలో రెండు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణలో ఆరుగురు గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఇంటి ప్రహరీ స్థలం విషయంలో బంధువులైన మందా బాబూరావు, మందా వీరాంజనేయులు కుటుంబాల మధ్య శుక్రవారం ఘర్షణ చోటు చేసుకుంది. ఇరు వర్గాల వారు దాడి చేసుకోగా ఆరుగురికి గాయాలు అయ్యాయి. వారిని చికిత్స కోసం అద్దంకి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

 

మరిన్ని వార్తలు