డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లకు స్థల పరిశీలన

21 Jul, 2016 17:16 IST|Sakshi
డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లకు స్థల పరిశీలన

మోమిన్‌పేట: మండలంలోని మొరంగపల్లి గ్రామంలో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లకు తహసీల్దార్‌ గోపీరాం గురువారం స్థలాన్ని పరిశీలించారు. గ్రామంలోని ప్రభుత్వ భూమి 254 సర్వే నంబరులో 20 డబుల్‌ బెడ్‌ రూమ్‌లకుగాను గతంలో చూసిన స్థలాన్ని మళ్లీ పరిశీలించారు. రెండెకరాలు అనువుగా ఉందని తహసీల్దార్‌ గోపీరాం పేర్కొన్నారు. ఈ నివేదికను ప్రభుత్వానికి పంపించనున్నట్లు ఆయన తెలిపారు. ఆయన వెంట ఇన్‌చార్జి సర్వేయర్ సుధాకర్‌, వీఅర్‌ఓ శంకరయ్య తదితరులు ఉన్నారు.

>
మరిన్ని వార్తలు