లంచగొండులను రక్షిస్తారా?

28 Nov, 2016 00:24 IST|Sakshi
లంచగొండులను రక్షిస్తారా?

మోదీ, సోనియా గాంధీ, ఎంపీలకు జేపీ లేఖ
సాక్షి, హైదరాబాద్: సవరణలు ప్రతిపాదించిన అవినీతి నిరోధక చట్టం బాధిత ప్రజలకు శిక్ష.. లంచగొండులకు రక్ష అన్నట్లుగా ఉందని ఈ సవరణలు మార్చాలని ప్రధాని మోదీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఎంపీలకు లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ  శనివారం లేఖ రాశారు. నల్లధనం, దాని చుట్టూ ఉన్న అవినీతి అంతానికి ఒక పక్క భారీ ప్రక్షాళన చర్యలు చేపడుతున్నామంటూనే మరో పక్క ఆ పోరాటాన్ని నీరుగార్చేలా కేంద్రం వ్యవహరిస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సవరణలు ప్రతిపాదించిన అవినీతి నిరోధక చట్టాన్ని కేంద్రం బిల్లుగా పార్లమెంట్ ముందుకు తెస్తోందని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు