కడప అర్బన్ : కడప–తిరుపతి ప్రధాన రహదారిలో శనివారం ఉదయం పాల ప్యాకెట్ కోసం వెళ్లిన భూమిరెడ్డి చెన్నమ్మ (80) అనే వృద్ధురాలిని రాజంపేట వైపు నుంచి వచ్చిన లారీ ఢీకొనడంతో మృతి చెందింది. రామాంజనేయపురంలోని ఆంజనేయస్వామి ఆలయంలో పూజారిగా పనిచేస్తున్న జయరామిరెడ్డి తల్లి చెన్నమ్మ. వీరి స్వగ్రామం గోపవరం మండలం సంగసముద్రం. తల్లిదండ్రులు జయరామిరెడ్డి వద్దనే ఉంటూ జీవనం సాగిస్తున్నారు. గురువారం ఉదయం 5.30 గంటల సమయంలో మృతురాలు పాల ప్యాకెట్ తెచ్చేందుకు వెళ్లి తిరిగి వస్తుండగా గుర్తు తెలియని లారీ ఢీకొని వెళ్లిపోయింది. తీవ్ర గాయాల పాలైన చెన్నమ్మను రిమ్స్కు 108 వాహనంలో తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. ట్రాఫిక్ ఎస్ఐ చాంద్బాషా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.